- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తిలో ఆసరా పథకం వారోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు చిన్నారులతో కలిసి పాటలకి స్టెప్పులేశారు. అయితే కరోనా నిబంధనలు గాలికి వదిలేసి సంబరాల్లో చిందులేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
శ్రీకాళహస్తిలో ఆసరా వారోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు, మహిళలు, చిన్నారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదన్ ని పలువురు మహిళలు గజమాలతో సత్కరించారు.
అనంతరం సీఎం జగన్ పాటలకు నృత్యకారులు నాట్యం చేశారు. చిన్నారులు కూడా నృత్య ప్రదర్శన చేశారు. వారిని చూసి సంబరపడిన ఎమ్మెల్యే కూడా వారితో కలిసి స్టెప్పులేశారు. ఐతే చిన్నారులు కానీ, ఎమ్మెల్యే కానీ మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు.
మాస్కు కూడా ధరించకుండా చిన్నారులను అక్కున చేర్చుకుని ఎమ్మెల్యే డ్యాన్స్ చేయడం విమర్శలకు తావిస్తోంది. 10 సంవత్సరాలలోపు పిల్లలను కరోనా పట్ల చాలా అప్రమత్తంగా ఉంచాలని వైద్యులు సూచిస్తుంటే… ప్రజాప్రతినిధి అవన్నీ వదిలేసి మైమరిచి చిందులేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.