మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..!

by  |
మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..!
X

దిశ, వెబ్‎డెస్క్: గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. తుళ్లూరులో జరిగిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఇంత మంది పాల్గొనడంపై పలువురు విమర్శించారు. వైసీపీ మీటింగ్‎లకు కరోనా నిబంధనలు వర్తించడం లేదా రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం పోరాడే రైతులను కరోనా నిబంధనల పేరుతో పోలీసులు వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మీటింగ్‎పై నిలదీసిన రైతులను అదుపులోకి తీసుకోవడంపై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also…

లోకేశ్ లేఖ సారాంశం ఇదే..!



Next Story