ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ‘కోవిడైట్’ పేరిట వెబినార్

by  |
ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ‘కోవిడైట్’ పేరిట వెబినార్
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ పోషకాహార వారోత్సవాల్లో భాగంగా గురువారం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) కోవిడైట్‌ పేరిట వెబినార్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఐఎన్ డైరెక్టర్ ఆర్. హేమలత మాట్లాడుతూ ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించడానికి వ్యవసాయం, న్యూట్రిషన్‌ను అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్య అతిథి యూనిసెఫ్, పుణె కన్సల్టెంట్ డాక్టర్ నాగర్గేజే మాట్లాడుతూ పోషకాహారం కోసం వ్యవసాయం, ఇందుకు ఎదురయ్యే సవాళ్లు, పరిష్కార మార్గాలపై మాట్లాడగా, ఎన్ఐఎన్ సైంటిస్ట్ ఇస్మాయిల్ విటమిన్ డి ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎం. సోమశేఖర్, వెబినార్ కన్వినర్ ఎం. మహేశ్వర్ పాల్గొన్నారు.



Next Story