కిలో మటన్ రేట్ ఎంతో తెలిస్తే గుండె ఆగిపోవడం ఖాయం?

by Hamsa |   ( Updated:2023-04-21 09:18:19.0  )
కిలో మటన్ రేట్ ఎంతో తెలిస్తే గుండె ఆగిపోవడం ఖాయం?
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో ఒక్కసారిగా నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి. పైగా ఇది రంజాన్ మాసం కావడంతో మరోసారి రెట్టింపయ్యాయి. విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత కారణంగా పాకిస్తాన్ ఆర్థిక సవాళ్లతో పోరాడుతూనే ఉంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం సామాన్య ప్రజలకు కష్టంగా మారింది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల్లో అధికంగా మటన్ ధరలు ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తీవ్రమవుతున్న జీవన వ్యయంతో పాకిస్తాన్ అంతటా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

కిలో మటన్: రూ. 1800

కిలో బియ్యం: రూ. 335

ఆరెంజ్ పండ్లు: డజన్ రూ. 300

కిలో దానిమ్మ: రూ. 440

అరటిపండ్లు: డజన్ రూ. 300

ఆపిల్స్: కిలో రూ. 340

స్ట్రాబెర్రీ: రూ. 280

లీటర్ పెట్రోల్: రూ.286



Next Story