ఆటోను ఢీ కొట్టిన కారు.. మహిళ మృతి

by  |
ఆటోను ఢీ కొట్టిన కారు.. మహిళ మృతి
X

దిశ, కోదాడ: కారు ఆటో ఢీకొని ఓ మహిళ మృతిచెందగా, మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని దుర్గాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… కోదాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న ఆటోను వెనక నుంచి కారు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో యాసవరపు మేరీ(40) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరుగురికి గాయలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామాంజనేయులు తెలిపారు.


Next Story

Most Viewed