దోషం ఉందంటూ తాళి కట్టాడు..!

by  |
దోషం ఉందంటూ తాళి కట్టాడు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దోషం ఉందంటూ ఓ మహిళకు తాళి కట్టాడు నకిలీ జ్యోతిష్యుడు. ఈ ఘటన హైదరాబాద్‎లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‎బీ కాలనీకు చెందిన కోసూరి మాధవ్ అనే జ్యోతిషుడిని ఓ మహిళ ఆశ్రయించింది. మీ భర్తకు దోషం ఉందని.. పూజలు చేయకుంటే చనిపోతాడని మహిళను భయబ్రాంతులకు గురిచేశాడు. భర్త లేని సమయంలో జ్యోతిషుడు సదురు మహిళ ఇంట్లో పూజలు చేశాడు. పూజలు చేస్తున్న క్రమంలో ఆమె మెడలో తాళి కట్టి ఫోటోలు తీశాడు. అనంతరం ఆ ఫోటోలను చూపించి మహిళను వేధించసాగాడు. దీంతో నకిలీ జ్యోతిషుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మాధవ్‎ను అరెస్ట్ చేశారు.


Next Story