చెరువులోకి పిల్లలను తోసేసి.. తెల్లారేవరకూ అక్కడే కూర్చొని ఏడ్చింది

by  |
చెరువులోకి పిల్లలను తోసేసి.. తెల్లారేవరకూ అక్కడే కూర్చొని ఏడ్చింది
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట విద్యానగర్ లో నివాసముంటున్న ప్రశాంత్ కుమార్ కు 2006 లో పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన నాగమణితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక్క కూతురు, కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా కుటుంబంలో తగాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా… ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని చెరువు దగ్గరికి వెళ్లిన నాగమణి వారిని చెరువులోకి తోసేసింది. తానూ ఆత్మహత్య చేసుకుందామని చెరువులోకి దూకబోయింది. కానీ, ధైర్యం చాలక ప్రయత్నం ఉపసంహరించుకుంది. తెల్లవారుజాము వరకు అక్కడే కూర్చొని విలపిస్తూ స్థానికుల కంటపడింది. దీంతో విషయం పోలీసులకు తెలిసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed