వద్దన్నా వెళ్లాడు.. మనస్థాపంతో ఆత్మహత్య

by  |
వద్దన్నా వెళ్లాడు.. మనస్థాపంతో ఆత్మహత్య
X

దిశ, కోదాడ: సూర్యాపేట‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కాపుగల్లు గ్రామంలో ఆదివారం ఈఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావుల పెంట రజిత(28)ను వీరబాబుతో రెండో వివాహం చేశారు. గత 10 రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

వీరబాబు తన మొదటి భార్య కుమారులు దగ్గరికి వెళ్తానని చెప్పడంతో రజిత అడ్డుచెప్పింది. దీంతో రజిత పిన్ని వచ్చి వీరబాబుకు నచ్చచెప్పింది. అయినా అతను తన మొదటి భార్య కుమారుల దగ్గరికి వెళ్లాడు. దీంతో మనస్థాపం చెందిన రజిత ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story