మహిళ దారుణ హత్య….

by  |
మహిళ దారుణ హత్య….
X

దిశ వెబ్ డెస్క్: క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…కడవేర్గు గ్రామానికి చెందిన కొమ్మినేని నాగభూషణానికి ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిలో చంద్రమౌళీ అనే వ్యక్తి హైద్రాబాద్ లో ఉంటున్నారు. నాగభూషణానికి చంద్రమౌళికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై వదిన లక్ష్మీ క్షుద్ర పూజలు చేస్తోందన్న అనుమానం చంద్రమౌళికి వచ్చింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వదిన లక్ష్మీని చంద్రమౌళి గొడ్డలితో నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారి అయ్యడు. కాగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story