మ‌ణుగూరులో మ‌హిళ దారుణ హ‌త్య

by  |
మ‌ణుగూరులో మ‌హిళ దారుణ హ‌త్య
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా మ‌ణుగూరు ప‌ట్ట‌ణంలోని బేగం అనే మ‌హిళ‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తి దారుణంగా న‌రికి చంపాడు. ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ సెంట‌ర్‌లో బేగం చికెన్ షాపు న‌డుపుతూ జీవ‌నం సాగిస్తోంది.

శ‌నివారం ఉద‌యం న‌ల్లా వ‌ద్ద నీళ్లు ప‌డుతుండ‌గా బైక్‌పై వ‌చ్చిన దుండగుడు క‌త్తితో ఆమె మెడపై దాడి చేశాడు. దీంతో స‌ద‌రు మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయింది. అనంతరం ఆ దుండగుడు అక్కడి నుంచి ప‌రార‌య్యాడు. హ‌త్య‌కు పాత క‌క్షలేన‌ని తెలుస్తోంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed