రాఖీ కట్టేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

by  |
రాఖీ కట్టేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: అన్న క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ… రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై తనువు చాలించన ఘటన పలువురిని కలిచివేసింది. వివరాళ్లోకి వెళితే… వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్మిపల్లి స్టేజీ దగ్గర ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని తూముకుంట గ్రామానికి చెందిన నందిని అక్కడిక్కడే మృతి చెందింది. మరో యువతి లక్ష్మీ పరిస్థితి విషమంగా ఉంది. తుంకుంటా గ్రామానికి చెందిన వీరు పెద్దగడ గ్రామానికి రాఖీ కట్టడానికి వచ్చి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.


Next Story

Most Viewed