మహిళ అనుమానాస్ప‌ద మృతి…

by  |
మహిళ అనుమానాస్ప‌ద మృతి…
X

వివాహిత మహిళ అనుమానస్పందంగా మృతిచెందింది. ఈ ఘటన యాద‌గిరిగుట్ట ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌యివేట్ లాడ్జిలో జరిగింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గుండియాల్‌కు చెందిన హ‌రిజ‌న సీన‌మ్మ‌(45) మంగ‌ళ‌వారం రాత్రి గ‌ది అద్దెకు తీసుకుంది. బుధ‌వారం ఉద‌యం రూం తెరిచి చూస్తే శ‌వ‌మై ఉండ‌డంతో లాడ్జి నిర్వాహ‌కులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. విచార‌ణ‌లో మృతురాలు మ‌ద్యానికి బానిసైన‌ట్టు తేలింది. భిక్షాట‌న చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్న‌ట్టు ఎస్ఐ రాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించి, కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.



Next Story