భర్త పలకలేదని… భార్య ఆత్మహత్య

by  |
భర్త పలకలేదని… భార్య ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు జరుగడం, అవి సర్దుమనుగడం సర్వసాధారణం. కానీ కొన్ని గొడవలు మాత్రం ప్రాణం మీదకు తీసుకొస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హర్షిణి(32), ఆమె భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. హైదర్షాకోట్‌లో నివసిస్తున్నారు.

వీరికి గత ఏడాది డిసెంబర్‌లో వివాహమైంది. కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. రాత్రి వండుకోవాల్సిన కూర విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తీవ్రంగా మారడంతో భర్త బెడ్‌రూమ్‌లోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. హర్షిణి పిలిచినా అతడు తలుపు తీయకపోవడంతో ఆందోళన చెందిన ఆమె ఉరేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed