దేవతకు నైవేద్యంగా భార్య..!

by  |
దేవతకు నైవేద్యంగా భార్య..!
X

దిశ వెబ్‎డెస్క్: మానవుడు ఎంతో వైజ్ఞానిక అభివృద్ధి సాధించి విశ్వ రహస్యాలను ఛేదిస్తూ విశ్వ మానవుడుగా ఎదుగుతున్నా.. పలుచోట్ల మూఢనమ్మకాల పేరుతో వ్యక్తుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా దేవతను ప్రసన్నం చేసుకోవాలనే దురాశతో భార్యనే బలిచ్చాడు ఓ కర్కశుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ సింగ్రోలీ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బసౌదా గ్రామంలో 45ఏళ్ల బ్రిజేష్ జాతవ్ అనే వ్యక్తి.. తన భార్య బిట్టీ బాయ్‎ను బలిచ్చాడు. అనంతరం తలను, మొండెంను వేరుగా చేసి తన ఇంట్లోని పూజ గదిలో పాతిపెట్టాడు. అనంతరం బ్రిజేష్ ఇంట్లో నుంచి పారిపోయాడు. కుల దేవతను ప్రసన్నం చేసుకోవాలనే దురాశతో ఇలా చేశాడని బ్రిజేష్ కుమారులు ఆరోపించారు. ఇద్దరు కుమారుల ఫిర్యాదు మేరకు బ్రిజేష్‎పై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed