- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: మానవుడు ఎంతో వైజ్ఞానిక అభివృద్ధి సాధించి విశ్వ రహస్యాలను ఛేదిస్తూ విశ్వ మానవుడుగా ఎదుగుతున్నా.. పలుచోట్ల మూఢనమ్మకాల పేరుతో వ్యక్తుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా దేవతను ప్రసన్నం చేసుకోవాలనే దురాశతో భార్యనే బలిచ్చాడు ఓ కర్కశుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ సింగ్రోలీ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బసౌదా గ్రామంలో 45ఏళ్ల బ్రిజేష్ జాతవ్ అనే వ్యక్తి.. తన భార్య బిట్టీ బాయ్ను బలిచ్చాడు. అనంతరం తలను, మొండెంను వేరుగా చేసి తన ఇంట్లోని పూజ గదిలో పాతిపెట్టాడు. అనంతరం బ్రిజేష్ ఇంట్లో నుంచి పారిపోయాడు. కుల దేవతను ప్రసన్నం చేసుకోవాలనే దురాశతో ఇలా చేశాడని బ్రిజేష్ కుమారులు ఆరోపించారు. ఇద్దరు కుమారుల ఫిర్యాదు మేరకు బ్రిజేష్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story