- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డ్రగ్స్ కేసులో మరో నలుగురు నిందితులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో గత నెల 23వ తేదీన ఆరుగురిని భీమవరం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇందులో మొత్తం 15 మందికి సంబంధం ఉందని గుర్తించినట్లు వివరించారు. వీరిలో కౌశిక్ వర్మ, పృథ్వీరాజ్, ప్రసాద్, రాజీవ్ అనే మరో నలుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి సుమారు కిలో గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Next Story