గెలవడం ఎప్పుడైనా ఆనందమే : దినేష్ కార్తీక్

by  |
గెలవడం ఎప్పుడైనా ఆనందమే : దినేష్ కార్తీక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్2020లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు శనివారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ పెట్టిన స్వల్ప టార్గెట్‌ను 18 ఓవర్లలోనే చేధించారు. దీంతో హైదరాబాద్ జట్టు రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఆట అనంతరం మీడియాతో కోల్‌కత్తా కెప్టెన్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ… ‘గెలవడం ఎప్పుడైనా ఆనందంగా ఉంటుంది. మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలా కష్టపడ్డాము. మా జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం కలసి వస్తున్నది. అందుకే నేను ఏడుగురు బౌలర్లతో బంతులు వేయించగలిగాను. గతంలో ఓపెనర్‌గా వచ్చాను. కానీ ఇప్పుడు నాలుగో స్థానంలో రావాలనేది కోచ్ బ్రెండన్ ఆలోచన.’ అని తెలిపారు.


Next Story

Most Viewed