అక్రమ వసూళ్లు… ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

by  |
అక్రమ వసూళ్లు… ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్
X

దిశ ప్రతినిధి, వరంగల్: అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వరంగల్ నగరంలోని మట్వాడా పోలీస్ స్టేషన్‌లో నమోదైన మోటారు సైకిళ్ల చోరీకి సంబంధించిన కేసులో కానిస్టేబుళ్లు మహేందర్, రాజులు అక్రమ వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి.

దీనిపై స్పందించిన వరంగల్ కమిషనర్ తక్షణమే అధికారులను విచారణకు అదేశించారు. ఈ మేరకు పోలీస్ అధికారులు విచారణ జరిపి, కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో ఆ నివేదిక ఆధారంగా సదరు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.


Next Story

Most Viewed