రోజూ చిత్రహింసలకు గురిచేసేవాడు

by  |
రోజూ చిత్రహింసలకు గురిచేసేవాడు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పోలీసు కాల్పుల్లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే.. భార్య పలు విషయాలు వెల్లడించింది. వికాస్ దూబే తనను నిరంతరం టార్చర్ పెట్టేవాడని భార్య రిచా దుబే తెలిపారు. ప్రతి రోజు తిడుతూ .. కొడుతూ దారుణంగా హింసించే వాడని వెల్లడించింది. తన పిల్లుల వారి తండ్రి మాదిరే గ్యాంగ్ స్టర్లు అవుతారేమోనని భయంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పోలీసులను చంపే కుట్ర తనకు ముందే తెలిసి ఉంటే అలా జరగనిచ్చేదాన్ని కాదని రిచా అన్నారు. బాధిత పోలీస్ కుటుంబాలకు ఆమె క్షమాపణలు చెప్పారు. దుబే ఎన్‌కౌంటర్‌పై కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించినా తనకు సమ్మతమే అన్నారు. గతంలోనూ ఆమె ఎన్ కౌంటర్ ను సమర్థించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed