పవన్ కళ్యాణ్ కు విజయ సాయిరెడ్డి చురకలు

by  |
పవన్ కళ్యాణ్ కు విజయ సాయిరెడ్డి చురకలు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై ఎప్పుడూ విరుచుకుపడే వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేశారు. అయితే, ఈసారి విభిన్న రీతిలో ట్విట్ చేశాడు. అటు ప్రతిపక్షాలపై పరోక్ష ఆరోపణలు చేస్తూనే మరోపక్క ముఖ్యమంత్రి జగన్ పొగిగాడు.

‘ఉద్దానం ప్రాంత నివాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకానికి శ్రీకారం. నాయకులు అని చెప్పుకునే చాలా మంది వచ్చారు, చూశారు, హడావిడి చేసి వెళ్లిపోయారు. పరిష్కారానికి ముందడుగు వేసిన ఏకైక ప్రజానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు’ అని ఆయన ట్విట్ చేశాడు.


Next Story

Most Viewed