- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కెరియర్లో ఎన్నో హిట్స్ అందుకున్నారు. హీరోలకు ధీటుగా పోటీనిచ్చిన తన నటనకు ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, రాజకీయాల్లోకి ప్రవేశించాక చాలా గ్యాప్ తీసుకున్న విజయశాంతి.. తాజాగా ‘సరిలేరు నీకేవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నారు. కాగా, తన సినీ ప్రయాణంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు విజయ శాంతి.
తన మొదటి తెలుగు సినిమా ‘కిలాడీ కృష్ణుడు’ విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపిన ఆమె.. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు సహృదయతతో ఆదరించి అనేక విజయాలను, సమున్నత స్థానాన్ని అందించారని తెలిపారు. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరించారు. తనను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్స్టార్ కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.