కన్నాపై విజయసాయిరెడ్డి సెటైర్లు

by  |
కన్నాపై విజయసాయిరెడ్డి సెటైర్లు
X

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తూ.. “ఏంటి కన్నా.. తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్టు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీ పై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా? బాబు అజెండాతో ఆంధ్రాలో కమలం పువ్వును కబళించే పనిలో ఉన్న ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా?” అని ట్వీట్ ద్వారా తన సందేహన్ని వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed