- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు జట్లకే కాదు, ఇరు దేశాల అభిమానులకూ ఒక యుద్ధం వంటిదే. గత ఏడాది వరల్డ్ కప్లో ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడటానికి ఒకరోజు ముందు టీమ్ఇండియా జట్టు సభ్యులను పాక్ అభిమాని ఒకరు తీవ్రంగా దూషించారట. ఆ విషయాన్ని క్రికెటర్ విజయ్ శంకర్ తాజాగా ఒక పాడ్కాస్ట్ కార్యక్రమంలో చెప్పాడు. ‘పాకిస్తాన్తో మ్యాచ్లో నువ్వు ఆడుతున్నావ్ అని నాకు ముందురోజు చెప్పారు. ఆరోజు కొంత మంది జట్టు సభ్యులతో కాఫీకి వెళ్లాం. అక్కడకు వచ్చిన పాకిస్తాన్ అభిమాని ఒకరు మమ్మల్ని దూషించాడు. అదే సమయంలో వీడియో రికార్డ్ కూడా చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాం’ అని శంకర్ చెప్పాడు. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 89 పరుగుల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. విజయ్ శంకర్ తన తొలి బంతికే వికెట్ తీశాడు. ప్రపంచకప్లో ఇంత వరకు పాకిస్తాన్ జట్టు టీమ్ఇండియాను ఓడించలేదు.