మానవత్వం చాటిన బండి సంజయ్..

by  |
మానవత్వం చాటిన బండి సంజయ్..
X

దిశ, మానకొండూరు:

కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలో రెండు వాహనాలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

వరంగల్ వెళ్తున్న ఎంపీకి రోడ్డు పక్కన రక్తస్రావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్షతగాత్రులు కనిపించారు.దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన వాహనాన్ని ఆపి వారిని పరామర్శించారు. అనంతరం తన వాహనంలోనే బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు చొరవ చూపించారు.


Next Story

Most Viewed