వైస్ ఛాన్సలర్‌గా సిద్దిపేట జిల్లా వాసి

by  |
వైస్ ఛాన్సలర్‌గా సిద్దిపేట జిల్లా వాసి
X

దిశ, సిద్దిపేట: తొగుట మండలం వేములఘట్ గ్రామానికి చెందిన ఓయూ (OU) విశ్రాంత ప్రొఫెసర్ హరిపురం వెంకటేశ్వర్లు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ(kerala central university) వైస్ ఛాన్సలర్‌(vice chancellor) గా నియమితులయ్యారు. ఓయూలో కామర్స్ (commerce) డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపాల్‌(principal)గా పనిచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు ఎర్రన్నగారి రాజలింగారెడ్డి మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు పేద కుటుంబంలో పుట్టినా మొక్కవోని ధైర్యంతో కష్టపడి చదివి గ్రామం పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశారన్నారు. వెంకటేశ్వర్లు ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజలింగారెడ్డి అన్నారు.


Next Story

Most Viewed