‘దోషులను శిక్షించడమే దిశ కర్తవ్యం’

by  |
‘దోషులను శిక్షించడమే దిశ కర్తవ్యం’
X

దిశ ఏపీ బ్యూరో: దిశ పోలీస్‌ స్టేషన్లపై ఎలాంటి ఒత్తిడి లేదని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. గుంటూరులో బీటెక్ స్టూడెంట్ ఘటనపై ఆమె మాట్లాడుతూ, ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించారని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయడం, దోషులకు శిక్ష వేయించటమే దిశ పోలీస్ స్టేషన్ల పని అని చెప్పారు. కానీ స్టూడెంట్స్ స్థాయిలో ఇంత దుర్మార్గానికి పాల్పడటం దారుణమన్నారు. ఘటనపై పోక్సో చట్టంతో పాటుగా ఇతర కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయన్నారు ఏఐపీ అడ్రస్‌ ద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఆమె తెలిపారు. ఈసందర్భంగా ఈ కేసులో ఏ1 నిందితుని తల్లిదండ్రులు పోలీసుశాఖకు చెందిన వారే అయినప్పటికీ నిందితుడిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఎవరి ఒత్తిళ్లు తమపై లేవని స్పష్టం చేశారు, త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తామని వెల్లడించారు.


Next Story

Most Viewed