వచ్చే ఏడాది తొలినాళ్లలో టీకా

by  |
వచ్చే ఏడాది తొలినాళ్లలో టీకా
X

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా టీకాను తీసుకురావడానికి డెడ్‌లైన్‌గా తేదీ పెట్టుకోలేదని, అయితే, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో వ్యాక్సిన్ సిద్ధం కావొచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కరోనా టీకా ట్రయల్స్ కోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, వ్యాక్సిన్ సిద్ధమయ్యాక తొలిగా హెల్త్ వర్కర్లు, వయోధికులు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్నవారికి అందిస్తామని వివరించారు. కరోనా టీకాపై అనుమానాలున్న పక్షంలో మొదట తానే వేసుకుంటారని హామీనిచ్చారు. వ్యాక్సిన్ సెక్యూరిటీ, ధర, ఉత్పత్తి లాంటి విషయాలపై ఇప్పటికే తీవ్రంగా చర్చించినట్టు తెలిపారు.


Next Story