తెలంగాణ చరిత్రలో ఇవ్వాళ బ్లాక్ డే

by  |
తెలంగాణ చరిత్రలో ఇవ్వాళ బ్లాక్ డే
X

దిశ, వెబ్ డెస్క్: ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బాధాకరమైన రోజని, కేసీఆర్ మూఢ నమ్మకానికి 4కోట్ల ప్రజలను పణంగా పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేదని, కానీ ఇవ్వాళ న్యాయవ్యవస్థ పై కూడా నమ్మకం పోయిందని విచారం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టులో విచారణ చేసే లోపే కూల్చివేయాలని ఆలోచనతో సెక్రటేరియట్ కూల్చుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ చరిత్రలో ఇవ్వాళ ఒక బ్లాక్ డే అని ఆయన అభిప్రాయడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవుకాని రూ.500 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా? అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబ అవసరాల కోసం తెలంగాణ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని, లేకపోతే టి-కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని హెచ్చిరించారు. పక్క రాష్ట్రంలో సీఎం జగన్ అద్భుతంగా పనిచేస్తుంటే తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఏపీలో 10లక్షల టెస్టులు చేస్తే, తెలంగాణలో లక్ష టెస్టులా? అని మండి పడ్డారు.

సీఎస్ సోమేశ్ కుమార్ కేసీఆర్ కి తొత్తుగా మారారని ఆరోపించారు. 20 మందిని తొక్కి సీఎస్ గా పదవి పొందారని విమర్శించారు. సోమేశ్ కుమార్ సీఎస్ పదవికి అన్పిట్ అన్నారు. గవర్నర్ పిలుస్తే పోకుండా సీఎస్ రాజ్యాంగాన్ని అవమానించారని తెలిపారు. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న సమయంలో సీఎం ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రభుత్వం చూపించే లెక్కలకు గ్రౌండ్ లెవల్ లో లెక్కలకు చాలా తేడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ చీకటి కుట్రలో పాల్గొన్న ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితువు పలికారు.


Next Story

Most Viewed