ఐదు దశాబ్దాలుగా ఎదురుచూశాం : యోగి

by  |
ఐదు దశాబ్దాలుగా ఎదురుచూశాం : యోగి
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనడటం మా అదృష్టం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కొన్ని రోజుల్లో రామమందిరం కల నెరవేరబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తక్కువ మందితో భూమి పూజ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ రామమందిర నిర్మాణం కోసం ఐదు దశాబ్దాలుగా ఎదురుచూశామని, ఎందరో త్యాగాల ఫలితంగా ఈ కలనెరవేరుతోందని అన్నారు. కాగా ఇవాళ ప్రధాని మోడీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.


Next Story