- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట.. రూ.12 లక్షల వరకు నో ఇన్కం ట్యాక్స్

దిశ, వెబ్డెస్క్: 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న సందర్భంగా నిరుపేద, మధ్య తరగతి ప్రజలను ఉద్దేశించి ఆదాయపు పన్నుపై ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ నుంచి మినహాయింపును ఇస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి వెల్లడించారు. తాజా ప్రకటనతో పేద, మధ్య తరగతి ప్రజలకు పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా కానున్నాయి.
ఇక రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల లోపు ఆదాయం ఉంటే 25 శాతం, రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు వారికి 20 శాతం, రూ.12 లక్షల నుంచి 16 లక్షల లోపు వారికి 15 శాతం పన్ను విధించనున్నట్లుగా కొత్త శ్లాబులను ప్రకటించారు. త్వరలోనే రాబోయే ఇన్కం ట్యాక్స్ బిల్లు కూడా లిటిగేషన్లు తగ్గించేలా ఉంటుందని అన్నారు. BNS స్ఫూర్తితో ఆదాయపు శాఖ పన్ను ఉంటుందని తెలిపారు. అదేవిధంగా స్మాల్ ట్యాక్స్ పేయర్స్కు టీడీఎస్ లేదని తెలిపారు. వచ్చే వారం కొత్త వ్యక్తిగత ఇన్కం ట్యాక్స్ బిల్లును ప్రవేశ పెట్టబోతున్నామని వెల్లడించారు. అయితే, బిల్లు గురించి ప్రస్తుత బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదని, వచ్చే వారం ప్రత్యేకంగా బిల్లు సభ ముందుకు తీసుకొస్తామని తెలిపారు. అదేవిధంగా భీమా రంగంలో వంద శాతం ఎఫ్డీఐకి ఆమోదం తెలిపామని అన్నారు. కాగా, ఇన్కం టాక్స్లో ఉన్న అనవసరపు సెక్షన్లను కేంద్ర ప్రభుత్వం తొలగించనుంది.