కేంద్ర మంత్రి కైలాష్ చౌదరికి కరోనా

by  |
కేంద్ర మంత్రి కైలాష్ చౌదరికి కరోనా
X

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి కరోనా పాజిటివ్ అని తేలింది. రాజస్తాన్‌ జోధ్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరినట్టు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో శుక్రవారం రాత్రి కరోనా టెస్టు చేయించుకోగా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారందరూ టెస్టు చేయించుకోవాలని సూచించారు. తనకు జ్వరంతోపాటు శ్వాస సంబంధిత సమస్య తలెత్తిందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్టు వివరించారు. తన ఆరోగ్యంపట్ల ఎవరూ ఆందోళనచెందొద్దని కోరారు. జైసల్మేర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన పలు ప్రాంతాలు తిరిగారు.


Next Story