నిధుల్లేవు.. అప్పులు తెచ్చుకోండి: కేంద్రం

by  |
నిధుల్లేవు.. అప్పులు తెచ్చుకోండి: కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో 41వ జీఎస్‌టీ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు ఇవ్వలేమని.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం అప్పులు తెచ్చుకోవచ్చని కేంద్రం సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ ఉచిత సలహాపై ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు భగ్గుమన్నాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. రాష్ట్రాలపై అవసరానికి మించి కేంద్రం సుంకాలు వసూలు చేసి, రూ. 47 కోట్లను దేశ ఏకీకృత నిధికి బదిలీ చేసిందని.. ప్రస్తుతం నిధుల కొరత ఉన్నప్పుడు మాత్రం అప్పులు తెచ్చుకోవాలని చెప్పడం దారుణమన్నారు.



Next Story