సున్నం చెరువులో గుర్తుతెలియని డెడ్ బాడీ..!

by  |
సున్నం చెరువులో గుర్తుతెలియని డెడ్ బాడీ..!
X

దిశ, మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామంలోని సున్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి (50) మృతదేహం లభ్యమైంది. కందుకూరు సీఐ కృష్టంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గేదెలను మేపేందుకు చెరువు సమీపంలోకి వచ్చిన పశువుల కాపరి.. నీటిలో తేలిన మృతదేహన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటన జరిగి మూడు రోజులు అయిఉండొచ్చని భావిస్తున్నారు.



Next Story

Most Viewed