- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి మృతదేహాన్ని చూసి కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచి పెట్టడంతో ఆ గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది.
గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు బేత అచ్చమ్మ ఆదివారం ఉదయం చనిపోయింది. ఆ సమయంలో కుమారుడు ఇంట్లో లేడు. తల్లి చనిపోయిన సమాచారం తెలుసుకున్న దేవుడు ఆగమేఘాలమీద వచ్చి తల్లి మృతదేహాన్ని చూసి విలపిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
దీంతో బాధిత కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. వారి రోదన చూసిన గ్రామస్తులంతా కంటతడి పెడుతున్నారు. మరణించిన దేవుడు వయస్సు 50 సంవత్సరాలు కాగా, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story