- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత్కు యూఎన్ హెచ్చరిక
by Shamantha N |

X
న్యూఢిల్లీ: బొగ్గు గనుల్లో పెట్టుబడులు పెంచడం సమంజసం కాదని ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. దీని ఫలితంగా ప్రాణాంతక వాయు కాలుష్యం, ఆరోగ్య ఖర్చులు, గ్లోబల్ వార్మింగ్తో విపత్తులను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఇది ‘బ్యాడ్ ఎకనామిక్స్’ అని తెలిపారు. శిలాజ ఇంధనాల్లో పెట్టుబడులంటే ఆరోగ్య సమస్యలు, చావును కోరితెచ్చుకోవడమేనని ఎనర్జీ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ను ఉద్దేశిస్తూ గుటెరస్ వివరించారు. కరోనా మహమ్మారి ప్రాణాధారితాలను ధ్వంసం చేసిందని, కాబట్టి శిలాజ ఇంధనాలకు బదులు సోలార్ పవర్లో పెట్టుబడులు పెడితే ఉపాధి సృష్టి కూడా జరుగుతుందని పేర్కొన్నారు.
Next Story