పురోహిత బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడి ఎంపిక..!

by  |
పురోహిత బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడి ఎంపిక..!
X

దిశ,సిద్దిపేట: మన పూర్వీకుల నుంచి సంక్రమించిన గౌరవప్రదమైన, ధార్మికపరమైన హక్కు పౌరోహిత్యమని సిద్దిపేట స్థానిక స్మార్త పురోహిత బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు ఉమాపతి రామేశ్వర శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాలయంలో పురోహిత బ్రాహ్మణ పరిషత్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ నూతన పురోహిత బ్రాహ్మణ పరిషత్‎కు ఉమాపతి రామేశ్వర శర్మ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికైన రామేశ్వర శర్మను సంఘం సభ్యులు శాలువాతో సత్కరించారు.

అనంతరం రామేశ్వర వర్మ మాట్లాడుతూ.. భారతీయ సనాతన ధర్మాన్ని, ధార్మికతను కాపాడుతోంది పురోహితులని కొనియాడారు. తనపై నమ్మకం ఉంచి తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పరిషత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పరిషత్ సంక్షేమానికి, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed