అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి..

by  |
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి..
X

దిశ, కోరుట్ల :
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేపల వెళ్లిన వెళ్లిన యువకులు తిరిగిరాలేదు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన జిల్లాలోని మల్లాపూర్ మండలం మొగిలిపెట్ గ్రామశివారులో ఆదివారం వెలుగులోకివచ్చింది.

గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామశివారులోని చెరువులో చేపల వేటకు వెళ్లిన గడ్డం జీవన్(32) జక్కుల శ్రీనివాస్(35) అనే యువకులు విద్యుద్ఘాతానికి గురై మరణించారని తెలిపారు. అయితే, యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed