అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇద్దరు మృతి

by  |
అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ నగర్-దిల్‌షుక్ నగర్ ప్రధాన రహదారిపై అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతిచెందారు.

వివరాల్లోకివెళితే.. చైతన్యపురి యూటర్న్ వద్ద రవి (50), ధన్‌రాజ్ (25) రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో TS 13 UA 7633 నెంబర్ గల కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ వచ్చి వీరిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన వీరిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా, కారుతో పాటు డ్రైవర్ అక్కడి కూడా నుంచి పరారయ్యాడు. కారు నెంబర్‌ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సరూర్‌నగర్ పోలీసులు కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed