విద్యుత్ షాక్‌తో ఇద్దరు వలస కూలీలు మృతి

by  |
విద్యుత్ షాక్‌తో ఇద్దరు వలస కూలీలు మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పొట్టకూటి కోసం ఊరు కానీ ఊరు వచ్చి విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు వలస కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నెంచర్ల గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే…

గ్రామం శివారులోని 33kv విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా, 11kv తీగలు తలగడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా కూడా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.


Next Story