- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అలీసాగర్ లిఫ్ట్ కెనాల్ లో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లోని కోస్లీ గ్రామ శివారులో గల అలీసాగర్ లిఫ్ట్ కెనాల్ వద్ద శనివారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేట్ మండలం కోస్లీ గ్రామానికి చెందిన గణేష్ (17), శ్రీకాంత్ (19) లు కల్లు సేవించేందుకు గ్రామ శివారులోని కల్లు దుకాణం నుండి కల్లు ప్యాకెట్లను కొనుగోలు చేశారు. కల్లు సేవించేందుకు అలీసాగర్ లిఫ్ట్ కెనాల్ గట్టుకు వెళ్లారు.
రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సదరు యువకుల కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం గాలించారు. పంచ శ్రీకాంత్ కు చెందిన బైక్ కనిపించింది. అక్కడ గాలించగా లిఫ్ట్ కెనాల్ లో విగతజీవులుగా కనిపించారు. ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు.