పిడుగుపాటుకు ఇద్దరు క్రికెటర్లు మృతి

by  |
పిడుగుపాటుకు ఇద్దరు క్రికెటర్లు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ జట్టులో చోటు సంపాదించి, దేశం తరుఫున ఆట ఆడాలన్న వారి ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. పిడుగుపాటుకు ఇద్దరు యువ క్రికెటర్లు మృతిచెందారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మహ్మద్ నదీమ్, మిజనుర్ రెహ్మాన్ అనే ఇద్దరూ యువ క్రికెటర్లు గురువారం స్థానిక మైదానంలో జరగుతున్నప్రాక్టీస్ మ్యాచ్‌కు హాజరయ్యారు.

వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో, సరదాగా గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడారు. ఆ సమయంలో ఒక్కసారిగా వారిపై పిడుగు పడి, అక్కడికక్కడే మృతిచెందారు. ఎంతో భవిష్యత్తు ఉన్న క్రీడాకారులు ప్రకృతి ప్రకోపానికి బలయ్యారని కోచ్ అన్వర్ హుస్సెన్ ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story