పాపం.. 2 పశువులు మృతి

by  |
పాపం.. 2 పశువులు మృతి
X

దిశ, నిర్మల్: విద్యుత్ షాక్ తో రెండు పశువులు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తో రెండు పశువులు మృతిచెందాయి. గ్రామంలోని నర్సరీ వద్ద విద్యుత్ షాక్ కు గురై నర్సయ్యకు చెందిన ఎద్దు, గంగారెడ్డికి చెందిన గేదె మృతి చెందాయి. దీంతో ఆ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రెండు పశువులు మృతిచెందాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మృతి చెందిన పశువులకు పశు వైద్యాధికారి గోవర్ధన్ పంచనామా చేశారు.


Next Story