నిజామాబాద్‌లో తెల్లవారుజామున ఇద్దరు అరెస్ట్

by  |
నిజామాబాద్‌లో తెల్లవారుజామున ఇద్దరు అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని నిజాంకాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. మంగళవారం తెల్లవారు జామున టాస్క్ ఫోర్స్ సీఐ షాకీర్ అలీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. రేషన్ బియంతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హైదరాబాద్ చంద్రాయన్ గుట్టకు చెందిన సయిద్ ఇర్పాన్, మహమ్మద్ సల్మాన్, సయిద్ జలాలుద్దీన్ లుగా గుర్తించారు. వారిపై స్థానిక 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో 6ఏ కేసులతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం, రెండు వాహనాలను సీజ్ చేశారు.


Next Story