అన్నప్రసాద ట్రస్టు కార్యకలాపాలపై టీటీడీ సమీక్ష..!

by  |
అన్నప్రసాద ట్రస్టు కార్యకలాపాలపై టీటీడీ సమీక్ష..!
X

దిశ, వెబ్‎డెస్క్:

తిరుమలలో అన్నప్రసాదం ట్రస్ట్ కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో సమీక్ష నిర్వహించారు. అన్నప్రసాదం ట్రస్టుకు 5,68,421 మంది దాతలున్నారని ఆలయ ఈవో తెలిపారు. లాక్‎డౌన్ సమయంలో అన్నప్రసాదం ట్రస్టుకు 21,732 మంది దాతలు రూ.27 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఇక లాక్‎డౌన్ సమయంలో మూడు కోట్ల రూపాయలతో వలస కూలీలు, పేదలకు అన్నప్రసాదం పొట్లాలు అందించినట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు.


Next Story

Most Viewed