జూలై 4న ఈసెట్​

by  |
జూలై 4న ఈసెట్​
X

దిశ, న్యూస్​బ్యూరో: టీఎస్​ ఈసెట్​ –2020 ఆన్​లైన్​ పరీక్షను జూలై 4 (శనివారం ) నిర్వహించనున్నట్టు కన్వీనర్​ మంజూర్​ హుస్సేన్​ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 4న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో 38, ఆంధ్రప్రదేశ్​లో 4 కలిపి మొత్తం 42పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 27,993 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. జూన్​ 30వ తేదీ వరకు విద్యార్థులు ecet.tsche.ac.in వెబ్​సైట్​ నుంచి హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.



Next Story