కరోనాతో తంటాలు పడుతోన్న భారత్ : ట్రంప్

by  |
కరోనాతో తంటాలు పడుతోన్న భారత్ : ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో కరోనా తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోందని.. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను అగ్రరాజ్యం అమెరికా బాగానే అదుపు చేసిందన్నారు. కానీ, భారత్ వంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఈ వైరస్ పెద్ద తలనొప్పిగా మారిందని ట్రంప్ చెప్పారు.

అమెరికాలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైంది అమెరికాలోనే. ఈ సందర్భంగా మంగళవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారితో అమెరికా గట్టిగా యుద్ధం చేస్తోందని స్పష్టంచేశారు. ‘మిగతా పెద్ద దేశాల పరిస్థితిని చూస్తే.. మనం ఎంత బాగా వైరస్‌ను ఎదుర్కొంటున్నామో అర్థమౌతుందని వివరించారు. భారత ప్రభుత్వం ఈ వైరస్‌ను నియంత్రించడానికి నానా తంటాలు పడుతోందని.. చైనాలో ఇన్‌ఫెక్షన్ సోకిన వారి సంఖ్య ఇప్పటికీ కూడా రోజురోజుకూ పెరిగిపోతోందని’ ట్రంప్ తెలిపారు.


Next Story