జయ శంకర్ సార్‌ ఆశయాలు… నిజం చేశారు

by  |
జయ శంకర్ సార్‌ ఆశయాలు… నిజం చేశారు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల చౌరస్తాలోని ప్రొఫెసర్ జయ శంకర్ సార్ విగ్రహానికి టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ కలలు కన్న నీళ్లు, నిధులు, నియామకాలకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ వచ్చాక ప్రతి పల్లెలో చెరువులు తవ్వించి, ప్రాజెక్టుల రూపకల్పనతో నీళ్లు నింపారని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమై యావత్ తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పిన జయశంకర్ సార్ మాటను.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నిజం చేశారని వివరించారు.


Next Story