టీఆర్ఎస్ లీడర్ జంగంపల్లి ఆచూకీ లభ్యం..

by  |
టీఆర్ఎస్ లీడర్ జంగంపల్లి ఆచూకీ లభ్యం..
X

దిశ, సిద్దిపేట : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామంలో వారం రోజుల కిందట దర్గాపల్లి వాగులో ఓ ఇన్నోవా వాహనం గల్లంతైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కారులో ఉన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగంపల్లి శ్రీనివాస్ కోసం కూడా కనిపించకుండా పోయాడు.

నాటి నుంచి గాలింపు బృందాలు వెతుకుతూనే ఉన్నాయి. అయినా, ఎంతకూ అతని ఆచూకీ తెలియలేదు. కాగా, శనివారం దుర్గాపల్లి గ్రామంలో గల వాగులో ఓ మృతదేహాన్నిగుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆరా తీయగా, అది జంగంపల్లి శ్రీనివాస్ మృతదేహంగా తేలింది.


Next Story

Most Viewed