కేంద్ర మంత్రులకు చుక్కెదురు

by  |
కేంద్ర మంత్రులకు చుక్కెదురు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రులకు చుక్కెదురైంది. 20 నిమిషాల పాటు కాన్వాయ్ లోనే ఇద్దరు మంత్రులు ఉండిపోవాల్సి వచ్చింది. ఆర్ఎఫ్ సీఎల్‌లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో కేంద్ర మంత్రుల కాన్వాయ్‌ను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే కొరుకంటి చందర్ లు అడ్డుకున్నారు. ఎరువుల కర్మాగారం లోపలకు వెళ్ళకుండా గేట్ ముందే టీఆరెస్ఎస్ శ్రేణులతో కలిసి రెండు గంటలుగా బైఠాయించారు. దీంతో 20 నిమిషాల పాటు కాన్వాయ్ లోనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మండవ్య లు ఉండిపోవాల్సి వచ్చింది. కాగా ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది.



Next Story