గుమ్మడిదల ఎత్తిపోతలపై సీఎంకు వినతి

by  |
గుమ్మడిదల ఎత్తిపోతలపై సీఎంకు వినతి
X

దిశ, మేడ్చల్: కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు సంబంధించి సంగారెడ్డి కాల్వ‌పైన గుమ్మడిదల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌‌కు విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి. ఈ మేరకు శనివారం సీఎంను ప్రగతి భవన్‌లో కలిసి గుమ్మడిదల ఎత్తిపోతలతో కలగే ప్రయోజనాలను వివరించి, వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గుమ్మడిదల ఎత్తి పోతల పథకం ద్వారా దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 8 మండలాలు(మనోహరబాద్, ములుగు, మేడ్చల్, శివమ్‌పేట, హత్నూరా, జిన్నారం, అమీన్ పూర్, గుమ్మడిదల), 50 గ్రామాలకు తాగునీటిని కల్పించవచ్చన్నారు. ఈ ప్రాజెక్టుపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు.


Next Story

Most Viewed