వ్యవసాయేతర ఆస్తులపై టీ సర్కార్ కీలక నిర్ణయం….

by  |
వ్యవసాయేతర ఆస్తులపై  టీ సర్కార్ కీలక నిర్ణయం….
X

దిశ వెబ్ డెస్క్: వ్యవసాయేతర ఆస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వ్యవసాయేతర ఆస్తులు ఉన్న వారికి మెరున్ కలర్ పట్టాదార్ పాసు పుస్తకాలను జారీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయేతర ఆస్తులను ఉచితంగా ఆన్ లైన్‌లో మ్యుటేషన్ చేయించుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజప్తి చేశారు. ఇక ఇంచు భూమిని మ్యూటేషన్ చేయాలన్న ధరణి పోర్ట ల్ ద్వారా మాత్రమే చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు బావుల దగ్గర ఉండే ఇండ్లు, ఫామ్ హౌస్ లు ధరణి పోర్టల్ లోనే అప్ డేట్ చేయనున్నారు. ఇక నుంచి ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు సీఎం తెలిపారు. దీర్ఘకాల ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.


Next Story